ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో మంచి ప్రదర్శన చూపిస్తున్న యువ బ్యాట్స్మన్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అద్భుత బ్యాటింగ్తో అలరించిన గుజరాత్ టైటాన్స్
మ్యాచ్ ప్రారంభంలోనే మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ పవర్ప్లేలో 56-1 స్కోరు సాధించారు. 94 పరుగుల వద్ద జోస్ బట్లర్ 36 పరుగులు చేసి థీక్షణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్ మధ్య 62 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివరివరకు నిలిచి అద్భుతంగా ఆడిన సాయి సుదర్శన్ 82 పరుగులు చేసి గుజరాత్ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివర్లో రాహుల్ తేవాటియా మరియు రషీద్ ఖాన్ వేగంగా పరుగులు చేసినందున గుజరాత్ జట్టు మొత్తం 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్లో తుషార్ మరియు థీక్షణ చెరో రెండు వికెట్లు, సందీప్ మరియు ఆర్చర్ చెరో వికెట్ తీసుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచే నిలకడ కోల్పోయింది. పూర్తిగా ఆధిపత్యం చూపిన గుజరాత్ టైటాన్స్ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ జట్టును చిత్తుచేసింది. వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. రాజస్థాన్ బ్యాటింగ్లో హెట్మైయర్ 52 పరుగులు, కెప్టెన్ సంజు సాంసన్ 41 పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ మరియు సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ మరియు అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
For more IPL updates visit Sports