Headlines

గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

గుజరాత్ టైటాన్స్

IPL 2025 మ్యాచ్ నం. 19 గుజరాత్ టైటాన్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు పూర్తిగా ఆధిపత్యం సాధించి సన్‌రైజర్స్ పై 7 వికెట్ల తేడాతో 20 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పవర్‌ప్లేలో గొప్ప ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ జట్టు ని కట్టడి చేశారు. హైదరాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు.

బౌలింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో వరుసగా 4వ మ్యాచ్ లో ఓటమిపాలైంది. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన గుజరాత్ జట్టు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అభిషేక్ శర్మ కూడా సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి SRH జట్టు 45-2 స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వణికిన SRH జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ మరియు క్లాసన్ 50 పరుగులు SRH జట్టుకు చేశారు. బౌలింగ్‌లో అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన గుజరాత్ జట్టు లో సిరాజ్ 4 వికెట్లు తీసి, ప్రసిద్ధ్ మరియు సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీశారు.

గుజరాత్ టైటాన్స్

సులువుగా లక్ష్యాన్ని సాధించిన టైటాన్స్

154 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్ మరియు జోస్ బట్లర్ వరుసగా 3, 4 ఓవర్లలో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ తో కలసి గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 90 పరుగుల విలువైన భాగస్వామ్యం సాధించి గుజరాత్ జట్టును విజయం వైపు నడిపించాడు. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు చేసి అవుట్ కాగా, గిల్ 61 పరుగులు చేసి, రథర్‌ఫోర్డ్ 35 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. SRH జట్టు బౌలింగ్‌లో షమీ 2 వికెట్లు తీసి, కమిన్స్ ఒక వికెట్ సాధించాడు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *