Headlines

చెన్నైసూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం

రాయల్ ఛాలెంజర్స్

IPL 2025 మ్యాచ్ నెం.8 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఇరుజట్లూ గొప్ప ఆటతీరు కనబరిచినఈ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 50 పరుగుల తేడాతో ఛెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. పదహారు సంవత్సరాల తరువాత చెన్నై జట్టుపై చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లీ కొంచెం తడబడ్డాడు. 5వ ఓవర్లో ఫిల్ సాల్ట్ (32 పరుగులు) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే సమయానికి వీరిద్దరి జోడీ 45 పరుగులు జోడించింది. పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు 56/1 స్కోర్ సాధించింది. ఆ తరువాత విరాట్ కోహ్లీతో కలిసిపడి పడిక్కల్ మరియు పటిదార్ వేగంగా పరుగులు చేశారు. RCB జట్టు 76 పరుగుల వద్ద పడిక్కల్ క్యాచ్ అవుట్ కాగా, విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు 117 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఆ తరువాత లివింగ్‌స్టోన్ మరియు జితేష్ శర్మతో కలసి పటిదార్ స్కోర్ బోర్డును ముందుకు సాగించగా, వరుసగా బెంగళూరు జట్టు వికెట్లు కోల్పోయింది. 30 బంతుల్లో RCB కెప్టెన్ రజత్ పటిదార్ అర్ధశతకం సాధించాడు. ఆ తరువాత 18వ ఓవర్లో పతిరణ 2 వికెట్లు తీసుకోగా, బెంగళూరు ఫినిషర్ బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ చివరి ఓవర్లో 3 సిక్సులు బాది మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలింగ్‌లో నూర్ అహ్మద్ 3 వికెట్లు సాధించగా, పతిరణ 2, ఖలీల్ మరియు అశ్విన్ చెరో వికెట్ తీశారు.

రాయల్ ఛాలెంజర్స్

ఛేజింగ్‌లో తడబడిన సూపర్ కింగ్స్

197 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బెంగళూరు అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టింది. 2వ ఓవర్‌లోనే హాజిల్‌వుడ్ చెన్నై ఓపెనర్ త్రిపాఠి మరియు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను పడగొట్టాడు. వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో దీపక్ హుడా క్యాచ్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు 30/3 పరుగుల వద్ద కష్టాల్లో పడింది. రచిన్ రవీంద్ర మరియు సామ్ కరన్ కలిసి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేసినా, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల అవసరమైన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రచిన్ రవీంద్ర బౌల్డ్ అవ్వగా, శివమ్ దూబే, అశ్విన్ మరియు జడేజా వికెట్లు వెంటనే కోల్పోయారు. ఇన్నింగ్స్ చివర్లో ధోని 16 బంతుల్లో 30 పరుగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. RCB బౌలింగ్‌లో హజ్‌ల్వుడ్ 3 వికెట్లు తీసుకోగా, యశ్ దయాల్ మరియు లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, భువనేశ్వర్ 1 వికెట్ సాధించాడు.

For IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *