IPL 2025 మ్యాచ్ నెం.5లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. హై-స్కోరింగ్ మ్యాచ్లో ఇరు జట్లు ప్రేక్షకులను అలరించాయి. అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు గుజరాత్ టైటాన్స్పై 11 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
బ్యాటింగ్తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్:

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ జట్టు 3వ ఓవర్లోనే ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ వికెట్ను రబాడా ఓవర్లో కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో కలిసి స్కోర్బోర్డును ముందుకు నడిపించారు. పవర్ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగుల స్కోరు చేరుకున్నారు. వీరిద్దరి జోడీ 51 పరుగులు జోడించగా, టైటాన్స్ రెండో వికెట్ను దక్కించుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్య 47 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత కొద్ది వ్యవధిలోనే పంజాబ్ జట్టు అజ్మతుల్లా (15 పరుగులు), మాక్స్వెల్ (0) మరియు స్టోయినిస్ (20 పరుగులు) వికెట్లను కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో శశాంక్ సింగ్ మరియు అయ్యర్ హిట్టింగ్ చేయడంతో 76 పరుగులు జోడించి, టైటాన్స్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. టైటాన్స్ బౌలింగ్లో సాయి కిషోర్ 3 వికెట్లు సాధించగా, రబాడా మరియు రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఆఖర్లో తడబడిన టైటాన్స్:
రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు ఓపెనర్లు సాయి సుధర్షన్ మరియు శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లే చివరి ఓవర్లో మాక్స్వెల్ బౌలింగ్లో గిల్ 33 పరుగుల వద్ద అవుట్ కావడంతో, గుజరాత్ జట్టు 61/1 పరుగులు చేసింది.
ఆ తర్వాత బట్లర్తో కలిసి సాయి సుధర్షన్ 40 బంతుల్లోనే 84 పరుగుల భాగస్వామ్యం సాధించగా, సుధర్షన్ అవుట్ అయిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రథర్ఫోర్డ్, బట్లర్ 54 పరుగులు జోడించారు. కానీ పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతమైన బౌలింగ్ కారణంగా పెరిగిన రన్రేట్ను అధిగమించలేక గుజరాత్ ఓటమిపాలైంది. కింగ్స్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్కు వచ్చిన వైశాక్ విజయ్కుమార్ మంచి ప్రదర్శన కనబరిచడం వల్ల పంజాబ్ విజయం సాధించింది.
కింగ్స్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు దక్కించుకోగా, జాన్సెన్ మరియు మాక్స్వెల్ చెరో వికెట్ సాధించారు.
For more cricket updates check sports
Highlights please