ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 24లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన డిల్లీ జట్టు, బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. కీలక పరుగులు చేసిన కేఎల్ రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన డిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఆరంభంలో అదరగొట్టి, తరువాత నిరాశపరిచిన బెంగళూరు
బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి, మూడో ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఈ దశలో అతను రనౌట్ కావడంతో, బెంగళూరు జట్టు స్థిరత కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరును డిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఫిల్ సాల్ట్ మరియు టిమ్ డేవిడ్ మినహా మిగిలిన బ్యాటర్లందరూ తక్కువ పరుగులకే ఔటయ్యారు. డిల్లీ బౌలింగ్లో విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ముకేష్ కుమార్ మరియు మోహిత్ శర్మ ఒక్కో వికెట్ సాధించారు.
డిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ జట్టు ఆరంభంలో తడబడింది. పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 39 పరుగుల వద్ద నిలిచింది. ఆ తరువాత సుయాష్ శర్మ బౌలింగ్లో అక్సర్ పటేల్ ఔటైనా, కేఎల్ రాహుల్ మరియు స్టబ్లు కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలింగ్లో భువనేశ్వర్ రెండు వికెట్లు, యశ్ దయాల్ మరియు సుయాష్ చెరో వికెట్ సాధించారు.
for more IPL updates visit Sports