IPL 2025 మ్యాచ్ నం.46 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో గొప్ప ప్రదర్శన కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్పై 9 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన క్రుణాల్ పాండ్యా 1 వికెట్ తీసి, 73 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఢిల్లీని కట్టడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పవర్ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది. డుప్లెసిస్ మరియు పోరెల్ 33 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత హేజిల్వుడ్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు, యష్ దయాల్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ అయ్యాడు. ఆ తరువాత 28 పరుగులు చేసి డుప్లెసిస్ వెనుదిరిగాడు. అనంతరం కేఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్ కలిసి 30 పరుగుల భాగస్వామ్యం జోడించగా, విప్రాజ్ మరియు స్టబ్బ్స్ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా 37 పరుగుల భాగస్వామ్యం సాధించి జట్టు స్కోరును 162 పరుగులకు చేర్చారు. 41 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్లో భువనేశ్వర్ 3 వికెట్లు, హేజిల్వుడ్ 2 వికెట్లు సాధించగా, యష్ దయాల్ మరియు క్రుణాల్ పాండ్యా తలో వికెట్ దక్కించుకున్నారు.
RCB అద్భుత పోరాటం

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభంలోనే 3 వికెట్లను కోల్పోయింది. పవర్ప్లే ముగిసే సరికి ఆర్సీబీ జట్టు జాకబ్ బెథెల్, పడిక్కల్ మరియు రజత్ వికెట్లను కోల్పోయి 35-3 పరుగులు సాధించింది. ఆ తరువాత క్రుణాల్ పాండ్యాతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు, వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత చమీరా బౌలింగ్లో 51 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయిన విరాట్, టిమ్ డేవిడ్ వేగంగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్లో అక్షర్ పటేల్ 2 వికెట్లు, చమీరా ఒక వికెట్ సాధించారు.
for more IPL updates visit Sports