పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి

పంజాబ్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ నం.69 లో పంజాబ్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ జట్లు పోటి పడాయి. టాప్ 2 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన అలరించింది. ముంబయి ఇండియన్స్ జట్టు పై 7 వికెట్ల తేడాతో 9 బంతులు మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వ్‌స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

పంజాబ్ కింగ్స్

ముంబయి ఇండియన్స్ జట్టును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్

ఇరు జట్లు గెలుపు కోసం పోటి పడ్డ ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ జట్టు పవర్‌ప్లే లో 52-1 పరుగులు సాధించింది. రికెల్టన్ 27 పరుగులు మార్కో జాన్సన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అవగా, రోహిత్ శర్మ 24 పరుగులు సాధించి హర్ప్రీత్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ లో 57 పరుగులు సాధించి సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా మరియు నమన్ ధీర్ వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును 184 పరుగులకు చేర్చారు. పంజాబ్ జట్టు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, వైశాక్ విజయ్‌కుమార్ మరియు జాన్సన్ తలో 2 వికెట్లు సాధించగా, హర్ప్రీత్ 1 వికెట్ దక్కించుకున్నాడు.

పంజాబ్ కింగ్స్

సులభంగా విజయం సాధించిన పంజాబ్ కింగ్స్

పాయింట్స్ టేబుల్ లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది మరియు విజయం తో లీగ్ మ్యాచ్ ముగించింది. పంజాబ్ కింగ్స్ జట్టులో 73 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలవగా, ప్రియాంశ్ ఆర్య 62 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులు మరియు ప్రభసిమ్రన్ సింగ్ 13 పరుగులు సాధించారు. ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ లో శాంట్నర్ 2 వికెట్లు సాధించగా, బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయం తో పంజాబ్ జట్టు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడటానికి స్థానం ఖాయం చేసుకుంది.

For more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *