Headlines

రాజస్తాన్ రాయల్స్ చేతిలో 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పంజాబ్

రాజస్తాన్ రాయల్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.18లో రాజస్తాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన జోఫ్రా ఆర్చర్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు.

బ్యాటింగ్‌లో రాణించిన రాజస్తాన్ రాయల్స్:

రాజస్తాన్ రాయల్స్

పంజాబ్ కింగ్స్‌పై పోరులో రాజస్తాన్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా రాణించారు. పవర్‌ప్లేలో మంచి ప్రదర్శన కనబర్చిన ఈ జోడీ 53 పరుగులు సాధించింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శాంసన్ ఔట్ అయ్యే సమయానికి రాజస్తాన్ జట్టు 89/1 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రియాన్ పరాగ్‌తో కలిసి జైస్వాల్ 34 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో జైస్వాల్ బౌల్డ్ అయ్యే సమయానికి రాజస్తాన్ జట్టు 123/2 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో రియాన్ పరాగ్ మరియు హెట్‌మైర్ కలసి వేగంగా పరుగులు సాధించి రాజస్తాన్ జట్టు స్కోరు 205 పరుగులు గమనించిన లక్ష్యంగా నిలిపింది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా, జాన్సెన్ మరియు అర్షదీప్ తలో వికెట్ తీశారు.

చేదనలో తడబడిన పంజాబ్ కింగ్స్:

పంజాబ్ కింగ్స్

206 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్‌ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు, ఆ తర్వాత ఓవర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కోల్పోయి 43/4 స్కోర్ వద్ద నిలిచింది. పంజాబ్ జట్టులో బాగా బ్యాటింగ్ చేసిన నిహాల్ వాధేరా 62 పరుగులు చేయగా, మాక్స్‌వెల్ 30 పరుగులతో కొంత సహకారం అందించాడు. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన రాజస్తాన్ బౌలర్లు — ఆర్చర్ 3 వికెట్లు, సందీప్ మరియు థీక్షణ 2 వికెట్లు, కార్తికేయ మరియు హసరంగ తలో వికెట్ సాధించారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *