Headlines

రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2025 మ్యాచు నంబరు 50లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య చుట్టు జరిగింది. పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రికెల్టన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

శుభారంభం సాధించిన ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

ముంబై జట్టు ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేసి 94 పరుగుల భాగస్వామ్యంతో ముంబై జట్టు స్కోరును 217 పరుగులకు చేర్చారు. 61 పరుగులు సాధించిన రికెల్టన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌లో తీక్షణ మరియు రియన్ పరాగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్

ముంబై ఇండియన్స్

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో సూర్యవంశి అవుట్ కాగా, రెండవ ఓవర్‌లో యశస్వి జైస్వాల్ వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 62-5 పరుగులు మాత్రమే సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ బౌలర్లు ఏ దశలోనూ రాజస్థాన్ జట్టుకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తమవైపుకి తిప్పుకున్నారు. ముంబై జట్టు బౌలింగ్‌లో కర్ణ్ శర్మ, బౌల్ట్ చెరో 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా మరియు దీపక్ చహార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

for more IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *