ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.42లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబర్చిన ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు పడగొట్టిన హేజిల్వుడ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
మంచి స్కోర్ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేశారు. అనంతరం ఫిల్ సాల్ట్ 26 పరుగుల వద్ద హసరంగ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పదిక్కల్ మరియు కోహ్లీ కలిసి రెండో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం అందించారు. బెంగళూరు బ్యాటింగ్లో పదిక్కల్ 50 పరుగులు, విరాట్ కోహ్లీ 70 పరుగులు, టిమ్ డేవిడ్ 23 పరుగులు, జితేష్ 20 పరుగులు చేసి జట్టు మొత్తం స్కోరు 205 పరుగులు చేశారు. రాజస్థాన్ జట్టు బౌలింగ్లో సందీప్ శర్మ రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మరియు హసరంగ తలో వికెట్ తీసారు.
ఉత్కంఠభరిత విజయం అందుకున్న బెంగళూరు

206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వేగంగా ఆరంభించింది. భారీ షాట్లతో చెలరేగిన యశస్వి జైస్వాల్ కేవలం 19 బంతుల్లో 49 పరుగులు చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి రాజస్థాన్ జట్టు 72 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. పదో ఓవర్లో 113 పరుగులకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్థాన్ విజయానికి దాదాపు చేరినట్టే అనిపించింది. కానీ అనంతరం బెంగళూరు జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను తమకు అనుకూలంగా మలిచారు. హేజల్వుడ్ నాలుగు వికెట్లు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ మరియు యశ్ దయాల్ తలో వికెట్ తీసారు.
for more IPL updates visit Sports