Headlines

సన్‌రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ

లక్నో

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.7: లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో 23 బంతులు మిగిలుండగానే విజయాన్ని చేజిక్కించుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

లక్నో

ఆరంభంలో తడబడినా ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బ్యాటింగ్:

పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన సన్‌రైజర్స్ జట్టు 2వ ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అభిషేక్ 6 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అవ్వగా, ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ కుమార్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 62/2 స్కోరు సాధించగలిగింది. ఆ వెంటనే 8వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అవ్వగా వీరిద్దరి 61 పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్ట పడింది. లక్నో మంచి బౌలింగ్ కారణంగా ఆ తర్వాత సన్‌రైజర్స్ జట్టు పెద్ద భాగస్వామ్యాలను చేయలేకపోయింది. నితీష్ కుమార్ 32 పరుగులు, క్లాసెన్ 26 పరుగులు, అనికేత్ 36 పరుగుల స్కోర్ చేశారు. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 190/9 పరుగులు చేయగలిగింది. లక్నో జట్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు సాధించగా, మిగతా బౌలర్లు చెరో వికెట్ సాధించారు.

లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఇన్నింగ్స్:

లక్నో

191 పరుగుల టార్గెట్‌తో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో జట్టు ఆరంభంలోనే ఓపెనర్ మార్క్రమ్ 1 పరుగు వద్ద షమీ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్‌తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును లక్ష్యం వైపు నడిపించారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఈ జోడీ పవర్ ప్లే ముగిసే సరికి 77/1 స్కోర్ సాధించింది.18 బంతుల్లో నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 116 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత, 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్‌లో పూరన్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే 52 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే పంత్, బదోనీ వికెట్లను కోల్పోయినప్పటికీ మిల్లర్, సమద్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో కమిన్స్ 2 వికెట్లు సాధించగా, షమీ, జంపా, హర్షల్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

For more cricket updates check sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *