పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య అసలైన IPL పోరు చోటుచేసుకుంది. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో PBKS పైచేయి సాధించింది. IPL చరిత్రలోనే అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాసింది. IPL 2025 మ్యాచ్ నెం.31లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్తో PBKS జట్టు మ్యాజిక్ స్పిన్నర్ యూజీ చాహల్ గొప్ప విజయాన్ని అందించాడు. నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన PBKS జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బౌలింగ్తో అలరించిన కోల్కతా నైట్ రైడర్స్:
పంజాబ్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ త్వరగానే వికెట్లు కోల్పోయారు. పవర్ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 54/4 స్కోరు నమోదు చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన PBKS జట్టులో 30 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్ సింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ కలిసి సాధించిన 39 పరుగుల భాగస్వామ్యమే టాప్గా నిలవడం విశేషం. 15.3 ఓవర్లలో ఆల్ ఔట్ అయిన PBKS జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ముందుకు 112 పరుగుల టార్గెట్ను ఉంచింది. మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన కోల్కతా జట్టులో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నరైన్ తలో 2 వికెట్లు, వైభవ్ అరోరా మరియు నోర్డ్జే తలో ఒక వికెట్ సాధించారు.

పంజాబ్ చేతిలో చిత్తయిన కోల్కతా:
112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభంలో ఓపెనర్ వికెట్లు కోల్పోయినా, ఇంపాక్ట్ ప్లేయర్ రఘువంశీ మరియు కెప్టెన్ అజింక్య రహానే జట్టును ముందుకు నడిపించారు. మూడో వికెట్కు ఈ జోడీ 55 పరుగులు సాధించి మ్యాచ్ను త్వరగా ముగించగలుగుతారనే ఆశను కలిగించారు. అయితే, అప్పుడు మెట్టికి వచ్చిన PBKS స్పిన్నర్ యూజీ చాహల్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కోలుకోలేకపోయింది. 18 పరుగుల తేడాతో విజయం సాధించిన PBKS జట్టు, IPL చరిత్రలో అత్యల్ప స్కోరు డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. బౌలింగ్లో అద్భుత ప్రతిభ కనబరిచిన PBKS బౌలర్లలో చాహల్ 4 వికెట్లు, యాన్సెన్ 3 వికెట్లు సాధించగా, బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్ మరియు మ్యాక్స్వెల్ తలో ఒక వికెట్ తీశారు.
for more IPL updates visit Sports