Headlines

కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్, విజయ యాత్ర 24 పరుగుల తేడాతో CSKపై విజయం

ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ తలపడ్డాయి. వరుసగా 3వ మ్యాచ్‌లో సత్తా ఛాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

బ్యాటింగ్‌లో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్:

ఢిల్లీ క్యాపిటల్స్

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ మరియు అభిషేక్ పోరేల్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 51/1 పరుగులు సాధించారు. అభిషేక్ పోరేల్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, అక్షర్ పటేల్ 21 పరుగులు, రిజ్వి 20 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో స్టబ్బ్స్ మరియు KL రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 183 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 77 పరుగులతో KL రాహుల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు సాధించగా, జడేజా, నూర్ అహ్మద్ మరియు పతిరనా తలో వికెట్ తీసుకున్నారు.

లక్ష్యచేధనలో చతికిలపడిన చెన్నై:

ఢిల్లీ క్యాపిటల్స్

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీవ్ర ఇబ్బందులకు లోనైంది. పవర్‌ప్లేలో ఓపెనర్లు ఔట్ కావడంతో చెన్నై జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేకపోయింది. అవసరమైన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. చెన్నై తరపున 69 పరుగులు చేసిన విజయ్ శంకర్ టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎంఎస్ ధోని 30 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున విప్రాజ్ 2 వికెట్లు మరియు స్టార్క్, ముఖేష్ కుమార్ మరియు కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

for more IPL updates Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *