ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.27లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే సన్రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సీజన్లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును చేధించింది. కళ్లుచెదిరే హిట్టింగ్తో అలరించిన అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి, ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభం
మ్యాచ్ను ఆరంభించిన PBKS జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభసిమ్రన్ సింగ్ జోడీ మొదటి నాలుగు ఓవర్లలోనే 66 పరుగులు చేశారు. అనంతరం ప్రియాంశ్ ఆర్యా 36 వ్యక్తిగత పరుగుల వద్ద హర్షల్ పటేల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పవర్ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 89/1 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ (42 పరుగులు) ఈశాన్ మలింగా బౌలింగ్లో క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వధేరా వికెట్ కోల్పోయేసరికి పంజాబ్ జట్టు 13.3 ఓవర్లలో 164/3 వద్ద నిలిచింది. అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు సాధించగా, ఇన్నింగ్స్ చివరిలో మార్కస్ స్టోయినిస్ వేగంగా పరుగులు చేసి జట్టు స్కోరును 245 పరుగులకు చేర్చాడు. సన్రైజర్స్ బౌలింగ్లో హర్షల్ పటేల్ 4 వికెట్లు, ఈశాన్ మలింగా 2 వికెట్లు తీశారు.
అభిషేక్ మ్యాజిక్

246 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు కళ్లుచెదిరే ఆరంభాన్ని అందించారు. పవర్ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 83 పరుగులు సాధించింది. చెలరేగిపోయిన ఈ జోడీ 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం చాహల్ బౌలింగ్లో హెడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తరువాత కూడా వేగంగా పరుగులు చేసి 141 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్మన్గా రికార్డ్ నెలకొల్పాడు. PBKS బౌలింగ్లో చాహల్ మరియు అర్షదీప్ సింగ్ చెరో వికెట్ సాధించారు.
for more IPL updates visit Sports