IPL 2025 మ్యాచ్ నం.32లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. సూపర్ ఓవర్ థ్రిల్లర్తో ప్రేక్షకులను సంధడిలో ముంచాయి. సూపర్ ఓవర్లో 2 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఇరు జట్లు విజయానికి కోసం పోరాడగా, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అద్భుత ప్రదర్శనతో అలరించిన మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్:
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన DC జట్టు పవర్ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు సాధించింది. ఫ్రేసర్ మెక్గర్క్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. ఆ తరువాత రాహుల్ మరియు అభిషేక్ పోరెల్ 63 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత రాహుల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్టబ్బ్స్ 34 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు సాధించగా, 49 పరుగులతో అభిషేక్ పోరెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో DC జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు సాధించగా, తీక్షణ మరియు హసరంగ తలో వికెట్ దక్కించుకున్నారు.
సూపర్ డిఫెండ్, సూపర్ ఓవర్ విజయం:

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ చివర్లో తడబడింది. చివరి ఓవర్లో 9 పరుగులు సాధించాల్సి ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ 8 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్ విజయానికి అడ్డు కట్టవేశాడు. రాజస్థాన్ రాయల్స్ పవర్ప్లేలో వికెట్ కోల్పోకుండా 63 పరుగులు సాధించారు. ఆ తర్వాత సంజు శాంసన్ రిటైర్డ్ అవుట్ అయిన వెంటనే రియాన్ పరాగ్ బౌల్డ్ అయ్యాడు. జైస్వాల్ 51, నితీష్ రాణా 51, ధృవ్ జురేల్ 26 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించేలా కనిపించినా, ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను తమవైపు తిప్పుకొని, సూపర్ ఓవర్లో సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో DC జట్టు 6 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్స్గా నిలిచారు.
for more IPL updates visit Sports