IPL 2025 మ్యాచ్ నం.34లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ మధ్య పోరు జరిగింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు పరిమితం చేశారు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు అద్భుతమైన బౌలింగ్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన టిమ్ డేవిడ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం నుంచే తడబడింది. పవర్ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు తక్కువ స్కోర్కే పరిమితం అయింది. బెంగళూరు బ్యాటింగ్లో టిమ్ డేవిడ్ 50 పరుగులు చేయగా, కెప్టెన్ రాజత్ పటీదార్ 23 పరుగులు చేశారు. వీరిద్దరిని మినహాయించి మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన పంజాబ్ జట్టు బెంగళూరు జట్టును కేవలం 95 పరుగులకే కట్టడి చేసింది. బార్లెట్ 1 వికెట్ తీయగా, అర్షదీప్ సింగ్, మార్కో జాన్సెన్, చాహల్ మరియు బ్రార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ పైచేయి

95 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు నిలకడగా ఆడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పవర్ప్లేలో పంజాబ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయినా, లక్ష్యం తక్కువగా ఉండటంతో ఎటువంటి పొరపాట్లు చేయకుండా మ్యాచ్ను ముగించింది. పంజాబ్ జట్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నిహాల్ వధీర కీలక సమయంలో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. బెంగళూరు బౌలింగ్లో హాజిల్వుడ్ 3 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.
for more IPL updates visit Sports