IPL 2025 మ్యాచ్ నం. 43లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడాయి. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ చేసిన SRH జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 154 పరుగులకు కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్న హర్షల్ పటేల్ 4 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కామిందు మెండిస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

CSKను తక్కువ స్కోర్కు కట్టడి చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
ఇన్నింగ్స్ మొదటి బంతికే షమీ బౌలింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రషీద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయుష్ మాత్రమే powerplay పరుగులు సాధించగా, మరోవైపు సన్రైజర్స్ జట్టు వికెట్లను దక్కించుకుంది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో సామ్ కరన్ క్యాచ్ అవుట్ అవగా, 6వ ఓవర్లో మాథ్రే కూడా వెనుదిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు powerplay ముగిసే సమయానికి 50-3 పరుగుల స్కోరు సాధించింది. ఆ తర్వాత కొంచెం వేగం పెంచిన బ్రెవిస్ 42 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 154 పరుగులు సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో హర్షల్ పటేల్ 4 వికెట్లు సాధించగా, కమిన్స్, ఉనాద్కట్ చెరో 2 వికెట్లు మరియు షమీ, మెండిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

CSKపై సన్రైజర్స్ హైదరాబాద్ పైచేయి
155 పరుగులతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో 19 పరుగులు సాధించి హెడే వెనుదిరిగాడు. powerplay ముగిసే సమయానికి సన్రైజర్స్ జట్టు 37-2 పరుగులు సాధించింది. ఆ తర్వాత జడేజా బౌలింగ్లో క్లాసెన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 44 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలవగా, మెండిస్ మరియు నితీశ్ కుమార్ 49 పరుగుల భాగస్వామ్యం జోడించి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నై బౌలింగ్లో నూర్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకోగా, ఖలీల్, జడేజా మరియు కామ్బోజ్ చెరో వికెట్ సాధించారు.
for more IPL updates visit Sports