IPL 2025 మ్యాచ్ No.48 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చుట్టు చేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అలరించిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ 27 పరుగులు మరియు 3 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. లీగ్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయాన్ని సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

శుభారంభం అందుకున్న కోల్కతా నైట్ రైడర్స్
KKR ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు గుర్బాజ్ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్ప్లేలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 79-1 పరుగులు సాధించింది. KKR జట్టులో బ్యాట్స్మెన్ అందరూ సమిష్టిగా కృషితో పరుగులు జోడించారు. 44 పరుగులు సాధించిన రఘువంశీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇన్నింగ్స్ మధ్యలో రఘువంశీ మరియు రింకు సింగ్ కలిసి 61 పరుగుల భాగస్వామ్యం జోడించి స్కోరును ముందుకు నడిపించి జట్టు స్కోరును 204 పరుగులకు చేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్లో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, అక్సర్ పటేల్ మరియు విప్రజ్ నిగం 2 వికెట్లు సాధించగా, చమేరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

చివరలో తడబడిన ఢిల్లీ క్యాపిటల్స్
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుంది. పవర్ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 58-2 పరుగులు సాధించింది. అక్సర్ పటేల్ మరియు డుప్లెసిస్ 76 పరుగులతో అద్భుత భాగస్వామ్యం నిలబెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల మ్యాచ్ను చేజార్చుకుంది. 62 పరుగులు సాధించిన డుప్లెసిస్ టాప్ స్కోరర్గా నిలవగా, ఇన్నింగ్స్ చివరలో విప్రజ్ నిగం వేగంగా పరుగులు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలుపుపై ఆశలు కల్పించినా విజయాన్ని చేరుకోలేకపోయారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు సునీల్ నరైన్ 3 వికెట్లు, వరుణ్ 2 వికెట్లు, రస్సెల్, అంకుల్ రాయ్ మరియు వైభవ్ అరోరా తలో వికెట్ సాధించారు.
for more IPL updates visit Sports