IPL 2025 మ్యాచ్ No.6 రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడాయి. బార్సాపుర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్పిన్ బౌలింగ్ తో నైట్ రైడర్స్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ముందుగా టాస్ గెలిచిన కోల్కతా జట్టు కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నారు.
వరుస వికెట్లు కోల్పోవడంతో తక్కువ టార్గెట్:

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ సంజు సాంసన్ (13 పరుగులు) వ్యక్తిగతంగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి యశస్వి జైస్వాల్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ముగిసేసమయానికి రాజస్థాన్ జట్టు 54/1 పరుగులు చేసింది. వీరిద్దరి జోడీ కలిసి రెండో వికెట్కు 34 పరుగుల భాగస్వామ్యం జోడించింది. రాజస్థాన్ బ్యాటింగ్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అయితే, ఆ తర్వాత 13 పరుగుల వ్యవధిలోనే రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి, 11 ఓవర్లు ముగిసేసరికే 82/5 స్కోరుతో నిలిచింది. అనంతరం వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సహకారంతో రాజస్థాన్ జట్టు 151 పరుగులు చేయగలిగింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టులో వరుణ్, మొయిన్, వైభవ్ మరియు హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు దక్కించుకోగా, స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్ సాధించాడు.
కోల్కతా అద్భుత ప్రదర్శన:

రెండో ఇన్నింగ్స్లో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు, వికెట్ కోల్పోకుండా పవర్ ప్లే ముగిసేసమయానికి 40 పరుగులు సాధించింది. అనంతరం మొయిన్ అలీ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అవ్వగా, క్వింటన్ డికాక్ మరియు కెప్టెన్ రహానే కలిసి 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హసరంగ బౌలింగ్లో రహానే (18 పరుగులు) క్యాచ్ అవుట్ కాగా, డికాక్ మరియు రఘువంశీ కలిసి 83 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయం అందించారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఓపెనర్ డికాక్ 97 పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్లో హసరంగ ఒక వికెట్ దక్కించుకోగా, మిగతా బౌలర్లు నిరాశపరిచారు.
For more cricket updates check sports