Headlines

లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ సూపర్ విజయం

పంజాబ్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ నం. 13లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. గొప్ప ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

తడబడిన లక్నో సూపర్ జెయింట్స్

బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లక్నో జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో మార్క్రామ్ బౌల్డ్ అవ్వగా, LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ మరియు బదోనీ కలిసి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు. చాహల్ బౌలింగ్‌లో పూరన్ 44 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో బదోనీ మరియు అబ్దుల్ సమద్ కలిసి వేగంగా 47 పరుగుల భాగస్వామ్యం సాధించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో 44 పరుగులు చేసిన నికోలస్ పూరన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు సాధించగా, మ్యాక్స్‌వెల్, ఫెర్గ్యుసన్, జాన్సెన్ మరియు చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

పర్ విజయాన్ని సాధించిన పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్

ఈ సీజన్‌లో 2వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ జట్టు 172 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య తొందరగానే వికెట్ కోల్పోయినా, ప్రభుసిమ్రాన్ సింగ్ మరియు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ప్రభుసిమ్రాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నిహాల్ వధీరాతో కలిసి శ్రేయాస్ అయ్యర్ 22 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్‌లో దిగ్వేష్ 2 వికెట్లు దక్కించుకోగా, మిగతా బౌలర్లు అందరూ నిరాశపరిచారు.

For IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *