IPL 2025 టేబుల్ టాప్ 2 పొజిషన్లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో Royal Challengers Bengaluru జట్టు ఇప్పటివరకు జరగని సందర్భాన్ని మార్చేసింది. RCB జట్టు అత్యధిక రన్చేస్ చేసి 228 పరుగులు సాధించి విజయం కైవసం చేసుకుని క్వాలిఫయర్ 1లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్లో సెంచరీతో Lucknow Super Giants జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ అలరించినా, RCB జట్టు బ్యాట్స్మెన్ అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకున్నారు. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన Royal Challengers Bengaluru జట్టు కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

చివరి మ్యాచ్లో చెలరేగిపోయిన రిషభ్ పంత్
2025 సీజన్లో ఈ మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్ అవ్వగా, ఇప్పటివరకు నిరాశ పరచిన Lucknow Super Giants కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 118 పరుగులు సాధించి IPLలో 2వ సెంచరీ సాధించాడు. మిచెల్ మార్ష్ 67 పరుగులతో సహకారం అందించగా వీరిద్దరూ కలిసి 152 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. ఇన్నింగ్స్ చివరలో పూరన్ మరియు పంత్ కలిసి 49 పరుగులు సాధించి జట్టు స్కోరును 227 పరుగులకు చేర్చారు. RCB జట్టు బౌలింగ్లో తుషార, భువనేశ్వర్ మరియు రోమారియో షెఫర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

చేజింగ్లో ఆధరగొట్టిన Royal Challengers Bengaluru
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి Lucknow Super Giantsపై 6 వికెట్ల తేడాతో 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. చేజింగ్లో RCB జట్టు బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించారు. ఫిల్ సాల్ట్ 30 పరుగులు, విరాట్ కోహ్లీ 54 పరుగులు, మయాంక్ అగర్వాల్ 41 పరుగులు, రాజత్ పటిదార్ 14 పరుగులు సాధించగా, హిట్టింగ్తో చెలరేగిపోయిన జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. Lucknow Super Giants జట్టు బౌలింగ్లో విలియం 2 వికెట్లు సాధించగా, ఆకాష్ మరియు అవేశ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో RCB జట్టు పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుని క్వాలిఫయర్ 1 ఆడటానికి అర్హత సాధించింది. 29వ తేది చండీగఢ్లో జరగనున్న క్వాలిఫయర్ 1లో Punjab Kings మరియు Royal Challengers Bengaluru జట్లు పోటీ పడనున్నాయి.
For more IPL updates visit Sports