IPL 2025 మ్యాచ్ నం. 15 సన్రైజర్స్ హైదరాబాదు మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అరోరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొదట వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్ నిలబెట్టారు

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ వికెట్లను కోల్పోయింది. పవర్ప్లే ముగిసే సమయానికి 53/2 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ప్రారంభంలో రాణించిన పాట్ కమిన్స్ మరియు మొహమ్మద్ షమీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత రఘువంశీ మరియు నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే కలిసి 81 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అనంతరం 10 పరుగుల వ్యవధిలోనే ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ కావగా, రింకు సింగ్ తో కలిసి వెంకటేష్ అయ్యర్ 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్కోర్ను 200/6కి చేర్చగలిగారు. నైట్ రైడర్స్ జట్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వెంకటేష్ అయ్యర్ 60 పరుగులు సాధించాడు. సన్రైజర్స్ హైదరాబాదు బౌలింగ్లో మొహమ్మద్ షమీ, పాట్ కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్ మరియు కమిందు మెండిస్ చెరో వికెట్ తీశారు.
కుప్పకూలిన సన్రైజర్స్ బ్యాటింగ్

201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాదు జట్టు ఆరంభం నుంచే గాడి తప్పింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ దాడికి తట్టుకోలేక 120 పరుగులకే ఆలౌటైంది. సన్రైజర్స్ హైదరాబాదు జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులు మినహా మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పవర్ప్లేలోనే 3 వికెట్లు దక్కించుకుంది. ఏ దశలోనూ సన్రైజర్స్ హైదరాబాదు జట్టు లక్ష్యాన్ని చేధించగలదనే పోటీ కనబర్చలేదు. నైట్ రైడర్స్ బౌలింగ్లో వైభవ్ అరోరా మరియు వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీయగా, ఆండ్రే రసెల్ 2 వికెట్లు, హర్షిత్ రాణా మరియు సునీల్ నరైన్ చెరో వికెట్ సాధించారు.
For more IPL updates visit Sports