IPL 2025 మ్యాచ్ నం.33లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ జట్టు గొప్ప ప్రదర్శన కనబర్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 4 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన MI జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు.

SRHను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబయి ఇండియన్స్
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మను MI జట్టు పవర్ప్లేలో స్కోరు చేయకుండా కట్టడి చేసింది. పవర్ప్లేలో సన్రైజర్స్ జట్టు వికెట్లు కోల్పోకపోయినా కేవలం 46 పరుగులు మాత్రమే సాధించింది. 59 పరుగుల భాగస్వామ్యం అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి క్యాచ్ అవుట్ కాగా, విల్ జాక్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ స్టంప్ అవుట్, ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబయి జట్టు ముందు 163 పరుగుల లక్ష్యం ఉంచింది. SRH బ్యాటింగ్లో 40 పరుగులు చేసిన అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలిచారు. MI బౌలింగ్లో విల్ జాక్స్ 2 వికెట్లు తీసగా, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ చొప్పున దక్కించుకున్నారు.

సులభంగా లక్ష్యం చేరుకున్న ముంబయి
163 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన MI జట్టు మంచి ఆరంభం అందుకుంది. పవర్ప్లే ముగిసే సమయానికి రోహిత్ 26 పరుగులతో అవుట్ అయినా MI జట్టు 55/1 పరుగులు సాధించింది. ఆ తర్వాత రికెల్టన్ 31 పరుగులు, విల్ జాక్స్ 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో తిలక్ వర్మ మరియు హార్దిక్ కలిసి మ్యాచ్ను త్వరగా ముగించారు. MI బ్యాటింగ్లో ప్రతి బాట్స్మన్ తమవంతు పాత్ర పోషించారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, మలింగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
for more IPL updates visit Sports