
Stock Market Highlights – 3 ఏప్రిల్ 2025
SENSEX 76,295 -322 NIFTY 50 23,250 -82 BANK NIFTY 51,597 +249 ఈ రోజు ఉదయం Stock Market SENSEX (-511 పాయింట్లు) మరియు NIFTY 50 (-132 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 26% ప్రతిస్పందనా సుంకం విధించడంతో, మార్కెట్ ప్రతికూలంగా మారింది. ఈ కారణంగా ఆటోమొబైల్ మరియు మెటల్ రంగాలు నష్టాలతో ముగిశాయి. IT రంగం కూడా నష్టాల్లో ముగిసింది. రాబోయే వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనుంది. ప్రస్తుత రెపో రేట్ 6.5% వద్ద ఉండగా, దీనిపై విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్పొరేట్ అప్డేట్స్: ➡ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరుకు ₹0.50 ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటించింది. 4-ఏప్రిల్-2025 రికార్డ్ తేదీగా, 4-ఏప్రిల్-2025 ఎక్స్-డేట్గా నిర్ణయించారు. ➡ KBC గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ 1:1 బోనస్ షేర్లు…