
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ థ్రిల్లర్ మ్యాచ్లో CSK పై విజయము
IPL 2025 మ్యాచ్ నం. 52 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. సూపర్ థ్రిల్లర్ మ్యాచ్లో చివరి బంతికి ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఇరు జట్లు విజయం దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. ఈ మ్యాచ్లో గెలుపుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కళ్ళు చెదిరే హిట్టింగ్తో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రొమారియో షెపర్డ్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో ఇది రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఓపెనర్లు కోహ్లీ మరియు బెథెల్ మంచి ప్రదర్శన కనబరిచారు. పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించారు. 28…