Headlines
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో CSK పై విజయము

IPL 2025 మ్యాచ్ నం. 52 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఇరు జట్లు విజయం దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కళ్ళు చెదిరే హిట్టింగ్‌తో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రొమారియో షెపర్డ్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఓపెనర్లు కోహ్లీ మరియు బెథెల్ మంచి ప్రదర్శన కనబరిచారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించారు. 28…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

IPL 2025 మ్యాచ్ నం.51 సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య చోటు చేసుకుంది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు సన్‌రైజర్స్‌ను, హైదరాబాద్ జట్టును దెబ్బకొట్టింది. బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ క్రిష్ణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరోసారి విజృంభించారు. సాయి సుదర్శన్ మరియు శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఈ జోడీ 82 పరుగులు సాధించారు. హిట్టింగ్‌తో అదరగొట్టిన ఈ జోడీ 87 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 76 పరుగులు సాధించి గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత బట్లర్ 64 పరుగులు సాధించి…

Read More
ముంబై ఇండియన్స్

రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

ఐపీఎల్ 2025 మ్యాచు నంబరు 50లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య చుట్టు జరిగింది. పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రికెల్టన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం సాధించిన ముంబై ఇండియన్స్ ముంబై జట్టు ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక గెలవల్సిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలిచి నిలిచింది

IPL 2025 మ్యాచ్ No.48 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చుట్టు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ 27 పరుగులు మరియు 3 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. లీగ్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయాన్ని సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ KKR ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు గుర్బాజ్ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 79-1 పరుగులు సాధించింది. KKR జట్టులో బ్యాట్స్‌మెన్ అందరూ సమిష్టిగా కృషితో పరుగులు…

Read More
రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై ఘన విజయం

ఎవరినైనా 14 ఏళ్లప్పుడు జీవితంలో నువ్వు ఏమి సాధిస్తావు? అని అడిగితే వాళ్లు సాధించాలనుకొనే విషయాలన్నీ చెప్పినప్పుడూ అనుమానించకూడదని ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రుజువు చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు ఐపీఎల్‌లో సెంచరీ సాధిస్తాడని చెబితే ఎవరైనా నవ్వుకునేవాళ్లేమో, కానీ ఇక మీదట అలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ అసాధ్యమైన పనిని సాధించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో చాలా రికార్డులు భద్దలు కొట్టాడు. ఈ రోజు ఐపీఎల్‌లో చోటుచేసుకున్న పరిణామం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని ఒక సంఘటనను, చరిత్రలో మిగిలిపోయే కొన్ని అంశాలను ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.47 లో చవిచూసారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసి, అత్యల్ప వయసులో సెంచరీ మరియు ఒకే సెంచరీలో ఎక్కువ బౌండరీలు కొట్టి రికార్డు సాధించాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…

Read More
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఢిల్లీపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం

IPL 2025 మ్యాచ్ నం.46 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన క్రుణాల్ పాండ్యా 1 వికెట్ తీసి, 73 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీని కట్టడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది. డుప్లెసిస్ మరియు పోరెల్ 33 పరుగుల భాగస్వామ్యం…

Read More
ముంబై ఇండియన్స్

LSG పై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం

IPL 2025 మ్యాచ్ నం.45లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య పోటీ జరిగింది. లీగ్‌లో ముందుకు వెళ్లే దశలో ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యంగా మారగా, ముంబై ఇండియన్స్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చూపిస్తూ లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి 2 వికెట్లు తీసి, 29 పరుగులు చేసిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెలరేగిన ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ జట్టు పవర్‌ప్లేలో మంచి ఆరంభాన్ని అందుకుంది. కేవలం ఒక వికెట్ కోల్పోయి 66-1 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో ఓపెనర్ రికెల్టన్ 58 పరుగులు సాధించగా, సూర్యకుమార్ 54…

Read More
పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ పోరులో వర్షం విజయం సాధించింది

IPL 2025 మ్యాచ్ No.44 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. మ్యాచ్ వల్ల అంతరాయం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో పాయింట్ ప్రకటించారు. లీగ్‌లో ముందుకెళ్లే దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ముఖ్యం కాగా, చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితంతో పంజాబ్ కింగ్స్ జట్టు 11 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెలరేగిన పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభుసిమ్రన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య పంజాబ్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే వికెట్ కోల్పోకుండా ఈ జోడీ 56 పరుగులు సాధించింది. ఆ తరువాత దూకుడు పెంచిన ప్రియాంశ్ ఆర్య 27 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్…

Read More
చెన్నై సూపర్ కింగ్స్

లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చతికిల పడిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ నం. 43లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడాయి. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసిన SRH జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 154 పరుగులకు కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న హర్షల్ పటేల్ 4 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కామిందు మెండిస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. CSK‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదటి బంతికే షమీ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రషీద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయుష్ మాత్రమే powerplay పరుగులు సాధించగా, మరోవైపు సన్‌రైజర్స్ జట్టు వికెట్లను దక్కించుకుంది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం

IPL 2025 Match no 40 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకొని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబర్చిన 4 వికెట్లు దక్కించుకున్న ముకేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఏకానా స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం అదిరిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రం మరియు మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా 51 పరుగులు సాధించారు. 87 పరుగుల…

Read More