టేబుల్ టాపర్స్ పోరులో గుజరాత్ టైటన్స్ విజయం
IPL 2025లో శనివారం రోజున డబుల్ హెడ్డర్లో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇరు జట్లు విజయం కోసం పోటీపడగా, గుజరాత్ టైటన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 4 బంతులు మిగిలినవేళ విజయాన్ని అందుకుంది. టార్గెట్ చేధనలో అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు జాస్ బట్లర్ 97 పరుగులతో మెరిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోరు సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు: ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్ప్లేలో వికెట్లు కోల్పోయినా అవసరమైన రన్రేట్తో ఆట కొనసాగించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించారు. అర్షద్ ఖాన్…