
ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
IPL 2025లో మ్యాచ్ సంఖ్య 60లో గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడినాయి. లీగ్లో ముందుకు సాగాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ జట్టును వికెట్ కోల్పోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని సాధించింది. శతకంతో ఆకట్టుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుధర్శన్ 108 పరుగులు సాధించి “మాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శతకంతో రాణించిన కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు నాలుగో ఓవర్లో డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్ మరియు పోరెల్ జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ కలసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్బ్స్ 21 పరుగులు చేసి రాహుల్కు తోడుగా…