Headlines
చెన్నై సూపర్ కింగ్స్

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం

IPL 2025 మ్యాచ్ నం.67 చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన డేవాల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులు చేసి మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో…

Read More
లక్నో సూపర్ జెయింట్స్

టేబుల్ టాపర్స్‌కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్

IPL 2025 మ్యాచ్ నం.64లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడ్డాయి. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన తొలి విదేశీ బ్యాట్స్‌మన్‌గా మిచెల్ మార్ష్ నిలిచాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు చేసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో జట్టు అద్భుతమైన ఆటతీరు‌తో అలరించింది. ముఖ్యంగా మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ గుజరాత్ టైటన్స్ జట్టును దెబ్బ తీశారు. లక్నో జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు సాధించింది….

Read More
గుజరాత్ టైటాన్స్

ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

IPL 2025లో మ్యాచ్ సంఖ్య 60లో గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడినాయి. లీగ్‌లో ముందుకు సాగాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ జట్టును వికెట్ కోల్పోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని సాధించింది. శతకంతో ఆకట్టుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుధర్శన్ 108 పరుగులు సాధించి “మాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శతకంతో రాణించిన కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు నాలుగో ఓవర్‌లో డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్ మరియు పోరెల్ జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ కలసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్బ్స్ 21 పరుగులు చేసి రాహుల్‌కు తోడుగా…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పై విజయం

IPL 2025 మ్యాచ్ నం.51 సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య చోటు చేసుకుంది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు సన్‌రైజర్స్‌ను, హైదరాబాద్ జట్టును దెబ్బకొట్టింది. బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ క్రిష్ణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరోసారి విజృంభించారు. సాయి సుదర్శన్ మరియు శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఈ జోడీ 82 పరుగులు సాధించారు. హిట్టింగ్‌తో అదరగొట్టిన ఈ జోడీ 87 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 76 పరుగులు సాధించి గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత బట్లర్ 64 పరుగులు సాధించి…

Read More
రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై ఘన విజయం

ఎవరినైనా 14 ఏళ్లప్పుడు జీవితంలో నువ్వు ఏమి సాధిస్తావు? అని అడిగితే వాళ్లు సాధించాలనుకొనే విషయాలన్నీ చెప్పినప్పుడూ అనుమానించకూడదని ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రుజువు చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు ఐపీఎల్‌లో సెంచరీ సాధిస్తాడని చెబితే ఎవరైనా నవ్వుకునేవాళ్లేమో, కానీ ఇక మీదట అలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ అసాధ్యమైన పనిని సాధించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో చాలా రికార్డులు భద్దలు కొట్టాడు. ఈ రోజు ఐపీఎల్‌లో చోటుచేసుకున్న పరిణామం భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని ఒక సంఘటనను, చరిత్రలో మిగిలిపోయే కొన్ని అంశాలను ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.47 లో చవిచూసారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ 35 బంతుల్లో పూర్తి చేసి, అత్యల్ప వయసులో సెంచరీ మరియు ఒకే సెంచరీలో ఎక్కువ బౌండరీలు కొట్టి రికార్డు సాధించాడు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ మీద పోరులో మారని కోల్‌”కత”

IPL 2025 మ్యాచ్ నెం.39లో గుజరాత్ టైటాన్స్ జట్టు 39 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయాన్ని సాధించింది. ఈ సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించిన గుజరాత్ జట్టు బౌలర్లు కోల్‌కతా జట్టును కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ గుజరాత్ జట్టు ఓపెనర్లు గిల్ మరియు సాయి సుధర్షన్ మంచి ప్రదర్శన ఈ సీజన్‌లో కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 45 పరుగులు సాధించారు. గుజరాత్ జట్టు మొదటి వికెట్ కోల్పోయే సరికి…

Read More
గుజరాత్ టైటన్స్

టేబుల్‌ టాపర్స్ పోరులో గుజరాత్ టైటన్స్ విజయం

IPL 2025లో శనివారం రోజున డబుల్‌ హెడ్డర్‌లో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇరు జట్లు విజయం కోసం పోటీపడగా, గుజరాత్ టైటన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 4 బంతులు మిగిలినవేళ విజయాన్ని అందుకుంది. టార్గెట్ చేధనలో అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు జాస్ బట్లర్ 97 పరుగులతో మెరిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోరు సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు: ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోయినా అవసరమైన రన్‌రేట్‌తో ఆట కొనసాగించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించారు. అర్షద్ ఖాన్…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం 58 పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చూపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రారంభంలోనే మూడో ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్‌తో కలిసి సాయి సుదర్శన్ పవర్‌ప్లేలో 56-1 స్కోరు సాధించారు. 94 పరుగుల వద్ద జోస్ బట్లర్ 36 పరుగులు చేసి థీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు….

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి…

Read More
గుజరాత్

ముంబైపై 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025 మ్యాచ్ నం.9లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన టైటాన్స్ జట్టు బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించిన టైటాన్స్: గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్‌ను దూకుడుగా ఆరంభించింది. టైటాన్స్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేశారు. ఆ తరువాత, 9వ ఓవర్లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ అవుట్ కావడంతో, బట్లర్‌తో కలిసి…

Read More