
గుజరాత్ టైటాన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం
IPL 2025 మ్యాచ్ నం.67 చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. హిట్టింగ్తో చెలరేగిపోయిన డేవాల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులు చేసి మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్తో చెలరేగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్ప్లేలో వేగంగా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో…