
ముంబయి ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమి చెందిన కోల్కతా
IPL 2025 మ్యాచ్ నెం. 12లో ముంబయి ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 43 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. డెబ్యూ మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబరిచిన అశ్వనీ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వాంఖడే స్టేడియం వేదికగా తలపడ్డ ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్లో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చెందిన ముంబయి జట్టు ఈ రోజు అద్భుతంగా రాణించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ మ్యాచ్లో పోటీ ప్రదర్శించలేకపోయారు. పూర్తిగా ఆధిపత్యం చలాయించిన ముంబయి జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కోల్కతా జట్టును చిత్తు చేసింది. పవర్ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన…