
సన్రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ
ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.7: లక్నో సూపర్ జెయింట్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో 23 బంతులు మిగిలుండగానే విజయాన్ని చేజిక్కించుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో తడబడినా ఆకట్టుకున్న సన్రైజర్స్ బ్యాటింగ్: పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన సన్రైజర్స్ జట్టు 2వ ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అభిషేక్ 6 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అవ్వగా, ఇషాన్ కిషన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ కుమార్తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 62/2 స్కోరు…