Headlines
ముంబై ఇండియన్స్

రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం

ఐపీఎల్ 2025 మ్యాచు నంబరు 50లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య చుట్టు జరిగింది. పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రికెల్టన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం సాధించిన ముంబై ఇండియన్స్ ముంబై జట్టు ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు…

Read More
ముంబై ఇండియన్స్

LSG పై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం

IPL 2025 మ్యాచ్ నం.45లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య పోటీ జరిగింది. లీగ్‌లో ముందుకు వెళ్లే దశలో ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యంగా మారగా, ముంబై ఇండియన్స్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చూపిస్తూ లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి 2 వికెట్లు తీసి, 29 పరుగులు చేసిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెలరేగిన ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ జట్టు పవర్‌ప్లేలో మంచి ఆరంభాన్ని అందుకుంది. కేవలం ఒక వికెట్ కోల్పోయి 66-1 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో ఓపెనర్ రికెల్టన్ 58 పరుగులు సాధించగా, సూర్యకుమార్ 54…

Read More
ముంబై ఇండియన్స్

SRH పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయo

IPL 2025 Match no 41 సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పూర్తీ ఆధిపత్యం కొనసాగించగా ముంబై ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలుండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో నెట్ రన్‌రేట్ బాగా మెరుగుపరుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ సూపర్ బౌలింగ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కొలకలేని దెబ్బతీశారు ముంబై బౌలర్లు. SRH జట్టు powerplay లో ముగిసే…

Read More
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తయిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 38లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. బ్యాటింగ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తక్కువ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలో రవీంద్ర 5 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి 48-1 పరుగులు సాధించింది. చెన్నై జట్టు యువ బ్యాట్స్‌మెన్ రషీద్ మరియు ఆయుష్ మాథ్రే కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత చహర్ బౌలింగ్‌లో ఆయుష్…

Read More
ముంబయి ఇండియన్స్

SRH పై ముంబయి 4 వికెట్ల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.33లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు గొప్ప ప్రదర్శన కనబర్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 4 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన MI జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. SRH‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబయి ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మను MI జట్టు పవర్‌ప్లేలో స్కోరు చేయకుండా కట్టడి చేసింది. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ జట్టు వికెట్లు కోల్పోకపోయినా కేవలం 46 పరుగులు మాత్రమే సాధించింది. 59 పరుగుల భాగస్వామ్యం అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో…

Read More
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దశాబ్దపు కల, ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో విజయం

IPL 2025 మ్యాచు నెం.20 ముంబయి ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చోటు చేసుకుంది. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్ IPL ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు విజయం కోసం పోటీ పడిన ఈ పోరులో గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ “మాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముంబయి వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతంగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్‌ను ట్రెంట్ బౌల్ట్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పడిక్కల్‌తో కలసి విరాట్ కోహ్లీ پا워ప్లే ముగిసే సమయానికి 73/1 పరుగులు…

Read More
లక్నో సూపర్ జెయింట్స్

ముంబయిని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 12 పరుగులతో విజయం 

IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్…

Read More
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమి చెందిన కోల్‌కతా

IPL 2025 మ్యాచ్ నెం. 12లో ముంబయి ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 43 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. డెబ్యూ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన అశ్వనీ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వాంఖడే స్టేడియం వేదికగా తలపడ్డ ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌లో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన ముంబయి జట్టు ఈ రోజు అద్భుతంగా రాణించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ మ్యాచ్‌లో పోటీ ప్రదర్శించలేకపోయారు. పూర్తిగా ఆధిపత్యం చలాయించిన ముంబయి జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా జట్టును చిత్తు చేసింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన…

Read More
గుజరాత్

ముంబైపై 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025 మ్యాచ్ నం.9లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన టైటాన్స్ జట్టు బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించిన టైటాన్స్: గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్‌ను దూకుడుగా ఆరంభించింది. టైటాన్స్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేశారు. ఆ తరువాత, 9వ ఓవర్లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ అవుట్ కావడంతో, బట్లర్‌తో కలిసి…

Read More
CSK

IPL 2025: ముంబై పై CSK విజయం

IPL 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో CSK 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.IPL‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ముందుగా టాస్ గెలిచిన CSK జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన ముంబై ఇండియన్స్ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ లో ప్రతిసారి లాగానే ఈ మ్యాచ్‌లో కూడా ముంబై తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో ముంబై జట్టు రికెల్టన్ మరియు విల్ జాక్స్ వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు 52/3 స్కోర్ సాధించింది. తర్వాత ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ 51 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే 29…

Read More