Headlines
RCB

Qualifier 1 లో Punjab పై RCB Royal Win

9 సంవత్సరాల తరువాత Royal Challengers Bengaluru జట్టు ఫైనల్ చేరుకుంది. Qualifier 1 మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధారగొట్టిన RCB జట్టు Punjab Kingsను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరుకుంది. 8 వికెట్ల తేడాతో 60 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లలో 60 బంతులు మిగిలుండగానే విజయం సాధించడం ఇది మొదటి సారి కావడం గమనార్హం. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌లో చెలరేగిపోయిన RCB IPL 2025లో నేరుగా ఫైనల్ చేరుకోవడానికీ ఇరు జట్లు పోటీ పడగా, ముందుగా బ్యాటింగ్ చేసిన Punjab Kingsను RCB బౌలర్లు కొలుకోలేని దెబ్బతీశారు. బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి Punjab Kingsను 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ చేశారు. Punjab Kings జట్టు పతనం ఇన్నింగ్స్…

Read More
పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి

IPL 2025 మ్యాచ్ నం.69 లో పంజాబ్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ జట్లు పోటి పడాయి. టాప్ 2 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన అలరించింది. ముంబయి ఇండియన్స్ జట్టు పై 7 వికెట్ల తేడాతో 9 బంతులు మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వ్‌స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ ఇరు జట్లు గెలుపు కోసం పోటి పడ్డ ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి…

Read More
Delhi Capitals

చివరి లీగ్ మ్యాచ్‌లో Delhi Capitals ధమాకా

IPL 2025 మ్యాచ్ నెం. 66లో Delhi Capitals మరియు Punjab Kings జట్లు మధ్య పోటీ జరిగింది. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన Delhi Capitals జట్టు 6 వికెట్ల తేడాతో 3 బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ పొజిషన్‌లో నిలిచే అవకాశం Punjab Kings పోగొట్టుకుంది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 58 పరుగులు చేసి Man of the Match అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన Delhi Capitals జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పట్టు వదలకుండా పోరాడిన Punjab Kings ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే Punjab Kings జట్టు ప్రియాంశ్ ఆర్య వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వేగంగా పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్ 12 బంతుల్లో 32 పరుగులు చేసి 6వ ఓవర్‌లో వికెట్ కోల్పోయాడు. పవర్‌ప్లే…

Read More
పంజాబ్ కింగ్స్

LSG పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.54 లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పూర్తిగా ఆధిపత్యం సాధించిన పంజాబ్ కింగ్స్ జట్టు 37 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది. ధర్మశాల లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ టాప్ పెర్ఫార్మెన్స్ పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పవర్‌ప్లే ముగిసే సమయానికి 66-2 పరుగులు సాధించింది. చెలరేగి ఆడిన ప్రభసిమ్రన్ సింగ్ 91 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు….

Read More
పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ పోరులో వర్షం విజయం సాధించింది

IPL 2025 మ్యాచ్ No.44 కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. మ్యాచ్ వల్ల అంతరాయం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో పాయింట్ ప్రకటించారు. లీగ్‌లో ముందుకెళ్లే దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ముఖ్యం కాగా, చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితంతో పంజాబ్ కింగ్స్ జట్టు 11 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెలరేగిన పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభుసిమ్రన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య పంజాబ్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లే వికెట్ కోల్పోకుండా ఈ జోడీ 56 పరుగులు సాధించింది. ఆ తరువాత దూకుడు పెంచిన ప్రియాంశ్ ఆర్య 27 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్…

Read More
పంజాబ్

లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పంజాబ్ పైచేయి, చాహల్ దెబ్బకి కోల్‌కతా చిత్తు

పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అసలైన IPL పోరు చోటుచేసుకుంది. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో PBKS పైచేయి సాధించింది. IPL చరిత్రలోనే అత్యల్ప స్కోరు‌ను డిఫెండ్ చేసిన పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాసింది. IPL 2025 మ్యాచ్ నెం.31లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో PBKS జట్టు మ్యాజిక్ స్పిన్నర్ యూజీ చాహల్ గొప్ప విజయాన్ని అందించాడు. నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన PBKS జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌తో అలరించిన కోల్‌కతా నైట్ రైడర్స్: పంజాబ్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ త్వరగానే వికెట్లు కోల్పోయారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 54/4 స్కోరు…

Read More
పంజాబ్

18 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో చతికిలపడ్డ చెన్నై

IPL 2025 మ్యాచ్ నం.22 లో పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, ఒకవైపు వికెట్లు పడుతున్నా కాలుచేసిన హిట్టింగ్‌తో చెన్నైపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 75/3 పరుగులు చేసింది. తన పవర్ హిట్టింగ్‌తో వేగంగా పరుగులు చేసి కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ప్రియాంశ్…

Read More
పంజాబ్ కింగ్స్

లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ సూపర్ విజయం

IPL 2025 మ్యాచ్ నం. 13లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. గొప్ప ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లక్నో జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో మార్క్రామ్ బౌల్డ్ అవ్వగా, LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఆ…

Read More