
గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం
ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి…