
చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం
IPL 2025 మ్యాచ్ నం.11 లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. నితీశ్ రాణా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బార్సాపారా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్ను కోల్పోయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ మరియు నితీశ్ రాణా స్కోర్బోర్డ్ను ముందుకు నడిపించారు. నితీశ్ రాణా చెలరేగి ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు….