
ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చేయి
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాట్స్మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 229 పరుగుల లక్ష్యం గుజరాత్ టైటాన్స్ ముందుంచిన ముంబయి ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి 208 పరుగులకు గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టడి చేశారు. ఎలిమినేటర్ లో గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనుంది. చండీగఢ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్ తో చెలరేగిపోయిన ముంబయి ఇండియన్స్ IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు బెయిర్స్టో గొప్ప ఆరంభం అందించారు. పవర్ప్లే ముగిసే సమయానికి ముంబయి జట్టు వికెట్ కోల్పోకుండా 79 పరుగులు సాధించింది. వీరిద్దరి జోడీ కలిసి…