
గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్రైజర్స్ పై విజయం
IPL 2025 మ్యాచ్ నం.51 సన్రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య చోటు చేసుకుంది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు సన్రైజర్స్ను, హైదరాబాద్ జట్టును దెబ్బకొట్టింది. బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ క్రిష్ణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరోసారి విజృంభించారు. సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ పవర్ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఈ జోడీ 82 పరుగులు సాధించారు. హిట్టింగ్తో అదరగొట్టిన ఈ జోడీ 87 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 76 పరుగులు సాధించి గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తరువాత బట్లర్ 64 పరుగులు సాధించి…