Headlines
ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం

IPL 2025 Match no 40 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకొని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబర్చిన 4 వికెట్లు దక్కించుకున్న ముకేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఏకానా స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం అదిరిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రం మరియు మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా 51 పరుగులు సాధించారు. 87 పరుగుల…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ మీద పోరులో మారని కోల్‌”కత”

IPL 2025 మ్యాచ్ నెం.39లో గుజరాత్ టైటాన్స్ జట్టు 39 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయాన్ని సాధించింది. ఈ సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించిన గుజరాత్ జట్టు బౌలర్లు కోల్‌కతా జట్టును కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ గుజరాత్ జట్టు ఓపెనర్లు గిల్ మరియు సాయి సుధర్షన్ మంచి ప్రదర్శన ఈ సీజన్‌లో కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 45 పరుగులు సాధించారు. గుజరాత్ జట్టు మొదటి వికెట్ కోల్పోయే సరికి…

Read More
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తయిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 38లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. బ్యాటింగ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తక్కువ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలో రవీంద్ర 5 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి 48-1 పరుగులు సాధించింది. చెన్నై జట్టు యువ బ్యాట్స్‌మెన్ రషీద్ మరియు ఆయుష్ మాథ్రే కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత చహర్ బౌలింగ్‌లో ఆయుష్…

Read More
బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చెందిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 37లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 157 పరుగులకు పంజాబ్ జట్టును కట్టడి చేసింది. RCB జట్టు 7 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో సమిష్టి కృషితో రాణించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి బెంగళూరు చేరుకుంది. మ్యాచ్ చివరి దాకా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తలపడిన ఈ జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి. తడబడిన పంజాబ్ కింగ్స్ జట్టు: మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియంశ్ ఆర్య మరియు ప్రభుసిమ్రన్ సింగ్ వేగంగా పరుగులు సాధించారు….

Read More
లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతో విజయం

IPL 2025లో శనివారం జరిగిన డబుల్ హెడ్డర్‌లో రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో IPL చరిత్రలో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అవేశ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌తో రాణించిన రాజస్థాన్ రాయల్స్: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత సందీప్ శర్మ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ LBWగా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో జట్టు…

Read More
ముంబయి ఇండియన్స్

SRH పై ముంబయి 4 వికెట్ల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.33లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు గొప్ప ప్రదర్శన కనబర్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 4 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన MI జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. SRH‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబయి ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మను MI జట్టు పవర్‌ప్లేలో స్కోరు చేయకుండా కట్టడి చేసింది. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ జట్టు వికెట్లు కోల్పోకపోయినా కేవలం 46 పరుగులు మాత్రమే సాధించింది. 59 పరుగుల భాగస్వామ్యం అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో…

Read More
ఢిల్లీ

సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీ ధమాకా

IPL 2025 మ్యాచ్ నం.32లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను సంధడిలో ముంచాయి. సూపర్ ఓవర్‌లో 2 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఇరు జట్లు విజయానికి కోసం పోరాడగా, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించిన మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన DC జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు సాధించింది. ఫ్రేసర్ మెక్‌గర్క్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. ఆ…

Read More
పంజాబ్

పంజాబ్ జట్టును శతకభాదిన అభిషేక్ – సన్‌రైజర్స్‌కు అద్భుత విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును చేధించింది. కళ్లుచెదిరే హిట్టింగ్‌తో అలరించిన అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభం మ్యాచ్‌ను ఆరంభించిన PBKS జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభసిమ్రన్ సింగ్ జోడీ మొదటి నాలుగు ఓవర్లలోనే 66 పరుగులు చేశారు. అనంతరం ప్రియాంశ్ ఆర్యా 36 వ్యక్తిగత పరుగుల వద్ద…

Read More
పంజాబ్

లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పంజాబ్ పైచేయి, చాహల్ దెబ్బకి కోల్‌కతా చిత్తు

పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అసలైన IPL పోరు చోటుచేసుకుంది. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో PBKS పైచేయి సాధించింది. IPL చరిత్రలోనే అత్యల్ప స్కోరు‌ను డిఫెండ్ చేసిన పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాసింది. IPL 2025 మ్యాచ్ నెం.31లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో PBKS జట్టు మ్యాజిక్ స్పిన్నర్ యూజీ చాహల్ గొప్ప విజయాన్ని అందించాడు. నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన PBKS జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌తో అలరించిన కోల్‌కతా నైట్ రైడర్స్: పంజాబ్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ త్వరగానే వికెట్లు కోల్పోయారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 54/4 స్కోరు…

Read More
డిల్లీ క్యాపిటల్స్

డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 24లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన డిల్లీ జట్టు, బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. కీలక పరుగులు చేసిన కేఎల్ రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో అదరగొట్టి, తరువాత నిరాశపరిచిన బెంగళూరు బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి, మూడో ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఈ దశలో అతను రనౌట్ కావడంతో, బెంగళూరు జట్టు స్థిరత కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరును డిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఫిల్ సాల్ట్ మరియు టిమ్ డేవిడ్ మినహా మిగిలిన…

Read More