
ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం
IPL 2025 Match no 40 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకొని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబర్చిన 4 వికెట్లు దక్కించుకున్న ముకేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఏకానా స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం అదిరిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రం మరియు మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా 51 పరుగులు సాధించారు. 87 పరుగుల…