గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం 58 పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్
ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మంచి ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో మంచి ప్రదర్శన చూపిస్తున్న యువ బ్యాట్స్మన్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుత బ్యాటింగ్తో అలరించిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రారంభంలోనే మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్తో కలిసి సాయి సుదర్శన్ పవర్ప్లేలో 56-1 స్కోరు సాధించారు. 94 పరుగుల వద్ద జోస్ బట్లర్ 36 పరుగులు చేసి థీక్షణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు….