IPL 2025: సన్రైజర్స్ అద్భుత విజయంతో శుభారంభం
IPL 2025 రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్పై 44 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్లో బలమైన బ్యాటింగ్ లైన్అప్ కలిగిన SRH జట్టు, తమ తొలి మ్యాచ్లోనే IPL చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కళ్లుచెదిరే హిట్టింగ్తో 20 ఓవర్లలో 286/6 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించింది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అదిరిపోయే ఆరంభం మ్యాచ్ ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మొదటి 3 ఓవర్లలోనే 45 పరుగులు చేశారు. అనంతరం అభిషేక్ శర్మ 24 పరుగుల వ్యక్తిగత స్కోరుతో తీక్షణ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్ SRH జట్టులో తొలిసారి ఆడుతున్నఇషాన్…