
సన్రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.10 లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 24 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే తడబడిన సన్రైజర్స్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను ఆరంభించిన సన్రైజర్స్ జట్టుకు క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. అద్భుతమైన బౌలింగ్తో ఢిల్లీ బౌలర్లు వికెట్లు సాధించారు. మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మను ఔట్ చేయగా, 3వ ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ వికెట్లను కూడా పడగొట్టాడు. ఆ తరువాత పవర్ప్లేలో…