
గెలుపుతో నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్
IPL 2025 మ్యాచ్ నెం.62 రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన రాజస్తాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా రాజస్తాన్ బౌలర్ ఆకాశ్ మాధ్వాల్ అడ్డుకున్నాడు. గొప్ప ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. CSK ను కట్టడి చేసిన రాజస్తాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే కాన్వే మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోయింది….