Headlines
లక్నో సూపర్ జెయింట్స్

ముంబయిని చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ పోరులో 12 పరుగులతో విజయం 

IPL 2025 మ్యాచ్ నం 16 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. ఇరు జట్లు గొప్ప ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఏకానా స్టేడియం వేదికగా చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోర్ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్స్ మిచెల్ మార్ష్ మరియు ఐడెన్ మార్క్రమ్ బాగా రాణించారు. హిట్టింగ్ చేస్తూ పవర్‌ప్లేలో సత్తా ఛాటిన మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

80 పరుగుల తేడాతో SRH ని చిత్తు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2025 మ్యాచ్ నం. 15 సన్‌రైజర్స్ హైదరాబాదు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అరోరా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్ నిలబెట్టారు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 53/2 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ప్రారంభంలో రాణించిన పాట్ కమిన్స్ మరియు మొహమ్మద్ షమీ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత రఘువంశీ మరియు నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే కలిసి 81 పరుగుల…

Read More
గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.14లో గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహమ్మద్ సిరాజ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. చిన్నస్వామి మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బతిన్న RCB మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7, పదిక్కల్ 4, ఫిల్ సాల్ట్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి…

Read More
పంజాబ్ కింగ్స్

లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ సూపర్ విజయం

IPL 2025 మ్యాచ్ నం. 13లో పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. గొప్ప ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఎకానా క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లక్నో జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 4వ ఓవర్లో మార్క్రామ్ బౌల్డ్ అవ్వగా, LSG కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఆ…

Read More
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమి చెందిన కోల్‌కతా

IPL 2025 మ్యాచ్ నెం. 12లో ముంబయి ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 43 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. డెబ్యూ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన అశ్వనీ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వాంఖడే స్టేడియం వేదికగా తలపడ్డ ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌లో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన ముంబయి జట్టు ఈ రోజు అద్భుతంగా రాణించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ మ్యాచ్‌లో పోటీ ప్రదర్శించలేకపోయారు. పూర్తిగా ఆధిపత్యం చలాయించిన ముంబయి జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా జట్టును చిత్తు చేసింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన…

Read More
రాజస్థాన్

చెన్నై సూపర్ కింగ్స్ పై  రాజస్థాన్ రాయల్స్  6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం

IPL 2025 మ్యాచ్ నం.11 లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. నితీశ్ రాణా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బార్సాపారా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ మరియు నితీశ్ రాణా స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. నితీశ్ రాణా చెలరేగి ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు….

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.10 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 24 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే తడబడిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ జట్టుకు క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఢిల్లీ బౌలర్లు వికెట్లు సాధించారు. మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను ఔట్ చేయగా, 3వ ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు నితీష్ కుమార్ వికెట్లను కూడా పడగొట్టాడు. ఆ తరువాత పవర్‌ప్లేలో…

Read More
గుజరాత్

ముంబైపై 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025 మ్యాచ్ నం.9లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. పూర్తి ఆధిపత్యం సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన టైటాన్స్ జట్టు బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించిన టైటాన్స్: గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్‌ను దూకుడుగా ఆరంభించింది. టైటాన్స్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేశారు. ఆ తరువాత, 9వ ఓవర్లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ అవుట్ కావడంతో, బట్లర్‌తో కలిసి…

Read More
రాయల్ ఛాలెంజర్స్

చెన్నైసూపర్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం

IPL 2025 మ్యాచ్ నెం.8 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఇరుజట్లూ గొప్ప ఆటతీరు కనబరిచినఈ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 50 పరుగుల తేడాతో ఛెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. పదహారు సంవత్సరాల తరువాత చెన్నై జట్టుపై చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లీ కొంచెం తడబడ్డాడు. 5వ ఓవర్లో ఫిల్ సాల్ట్ (32 పరుగులు) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే సమయానికి వీరిద్దరి జోడీ 45 పరుగులు జోడించింది. పవర్‌ప్లే ముగిసే సరికి…

Read More
లక్నో

సన్‌రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం.7: లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన కనబరిచిన లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో 23 బంతులు మిగిలుండగానే విజయాన్ని చేజిక్కించుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో తడబడినా ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బ్యాటింగ్: పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన సన్‌రైజర్స్ జట్టు 2వ ఓవర్‌లోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అభిషేక్ 6 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అవ్వగా, ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్ కుమార్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 62/2 స్కోరు…

Read More