8 వికెట్ల తేడాతో రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం
IPL 2025 మ్యాచ్ No.6 రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడాయి. బార్సాపుర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్పిన్ బౌలింగ్ తో నైట్ రైడర్స్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ముందుగా టాస్ గెలిచిన కోల్కతా జట్టు కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నారు. వరుస వికెట్లు కోల్పోవడంతో తక్కువ టార్గెట్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ సంజు సాంసన్ (13 పరుగులు) వ్యక్తిగతంగా ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి యశస్వి జైస్వాల్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ముగిసేసమయానికి రాజస్థాన్ జట్టు 54/1 పరుగులు చేసింది. వీరిద్దరి జోడీ కలిసి రెండో…